Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 యేళ్లు దాటిన వాహనాలపై హరిత పన్ను!

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (14:23 IST)
కేంద్ర ప్రభుత్వం వాహనదారుల జేబుకు చిల్లుపెట్టనుంది. 15 యేళ్లు దాటిన వాహనాలకు హరిపన్నును వసూలు చేయనుంది. అలాగే, 8 సంత్సరాలు దాటిన వాహనాలపై కూడా 10 నుంచి 25 శాతం మేరకు హరిత పన్నును వసూలు చేయనుంది. ప్రస్తుతం దేశంలో సుమారుగా 4 కోట్లకు పైగా వాహనాలు ఉన్నట్టు ఓ అంచనా. ఈ వాహనాలపై హరిత పన్నును విధించబోతున్నట్టు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. అందులో కర్ణాటకవే 70 లక్షల దాకా పాత వాహనాలున్నట్టు చెప్పింది.
 
అయితే, తెలుగు రాష్ట్రాల వివరాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని వెల్లడించలేదు. మధ్యప్రదేశ్, లక్షద్వీప్‌ల వివరాలూ కేంద్రం వద్ద లేవట. ఈ ఏడాది జనవరిలోనే హరితపన్నుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనను ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధమైంది.
 
4 కోట్ల పాత వాహనాల్లో సగానికిపైగా 20 యేళ్లు దాటిన వాహనాలేనని కేంద్రం చెప్పింది. కర్ణాటక తర్వాత అత్యధిక పాత వాహనాలున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 56.54 లక్షల పాత వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. అందులో 24.55 లక్షల వాహనాలు 20 ఏండ్లకు పైనవే కావడం గమనార్హం. 
 
దేశ రాజధాని ఢిల్లీ 49.93 లక్షల పాత వాహనాలతో మూడో స్థానంలోవుంది. ఆ రాష్ట్రంలో 20 ఏండ్లకు పైబడిన 35.11 లక్షల పాత వాహనాలున్నాయి. కేరళలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 34.64 లక్షలుంటే.. తమిళనాడులో 33.43 లక్షలున్నాయి. పంజాబ్ లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో 22.69 లక్షలున్నాయి. 
 
మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, హర్యానాల్లో 17.58 లక్షల నుంచి 12.29 లక్షల వరకున్నాయి. ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అసోం, బీహార్, గోవా, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూల్లో లక్ష నుంచి 5.44 లక్షల వరకు పాత వాహనాలున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments