Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడిన మామ.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (20:21 IST)
మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గపు మామ. ఈ దారుణ ఘటన గ్రేటర్ నోయిడాలో వెలుగుచూసింది.  వివరాల్లోకి వెళితే... కస్నాలో ఓ 38 ఏళ్ల వ్యక్తి ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆయన ఇంటిపక్కనే సోదరి కుటుంబం కూడా ఉంటోంది. నిందితుడు ఒంటరిగా ఉంటుండడంతో.. వంట చేయాలని మేనకోడలిని (18) ఇంటికి రమ్మన్నాడు. దాంతో మామ ఇంటికి వచ్చిన కోడలు.. కిచెన్‎లో వంట చేస్తుండగా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు.
 
 ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే బాధితురాలి ప్రవర్తనలో తేడా ఉండటంతో.. ఇంట్లో వాళ్లు గమనించి ఏం జరిగిందో చెప్పాలని ఒత్తిడి చేశారు. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత బాధితురాలు.. తన కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. వెంటనె బాధితురాలి తండ్రి.. కస్నా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. 
 
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు.. నిందితుడి మీద ఐపీసీ సెక్షన్ 376 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం తెలిసిన నిందితుడు.. వెంటనే పరారీ అయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం సోమవారం గాలింపు చేపట్టి.. న్యూఢిల్లీకి సమీపంలోని ఖాన్‌పూర్ గ్రామంలో అరెస్ట్ చేసి.. కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments