Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులను ఊచకోత కోసిన రోహింగ్యా ముస్లింలు...

మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ గ్రామంలో 28 మంది హిందువుల మృతదేహాలతో ఉన్న ఓ సమాధిని మయన్మార్ ఆర్మీ కనుగొంది. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నా

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (10:21 IST)
మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ గ్రామంలో 28 మంది హిందువుల మృతదేహాలతో ఉన్న ఓ సమాధిని మయన్మార్ ఆర్మీ కనుగొంది. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. రోహింగ్యాలకు పట్టున్న రఖినే జిల్లాలో ఈ దారుణం జరిగింది. 
 
రోహింగ్యా ముస్లిం మిలిటెంట్లే వీరిని హత్య చేసినట్టు చెబుతున్నారు. ముస్లింల దాడితో అక్కడి వేలాదిమంది హిందువులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆగస్టు 25న జరిగిన దాడులతో వారు తమపై కక్ష పెంచుకున్నారని, తమను లక్ష్యంగా చేసుకున్నారని హిందువులు చెబుతున్నారు. 
 
రోహింగ్యా ముస్లింలు హత్య చేసిన 28 మృతదేహాలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అత్యంత దారుణంగా, క్రూరంగా హతమార్చినట్టు ఆర్మీ చీఫ్ వెబ్‌సైట్ పేర్కొంది. అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఎస్ఏ) గ్రూప్ వీరిని హతమార్చినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments