పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులపై క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకత

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (22:00 IST)
పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ బిల్లులను వ్యతిరేకించిన బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు ఉన్నాయి.
 
హర్యానాలో బిజేపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న “జననాయక్‌ జనతా పార్టీ” (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
 
ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా జేజేపీ చీఫ్‌ దుశ్యంత్‌ సింగ్‌ చౌతాలా కొనసాగుతున్నారు.
 90 స్థానాలు ఉన్న హరియాణాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖట్టర్‌ నేతృత్వంలో బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ (46) లేదు.
 
పది స్థానాలలో గెలిచి కింగ్‌మేకర్‌గా దుష్యంత్‌ చౌతాలా నిలబడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి “జననాయక్‌ జనతా పార్టీ” వైదొలిగితే ఖట్టర్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments