Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లాక్‌డౌన్ పొడగింపు రూమర్ల'పై కేంద్రం స్పందన

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (10:28 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు అనేక ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, మన దేశంలో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ నెలాఖరు వరకు పొడగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై కేంద్రం స్పందించింది. ఈ వార్తలు నిరాధారమైనవని సోమవారం ఉదయం కేంద్ర ప్రభుత్వ అధికారిక మీడియా విభాగం పీటీఐ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెల్లడించింది. 'కొన్ని రూమర్లు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 21 రోజుల లాక్ డౌన్ ముగిసిన తరువాత దాన్ని పొడిగిస్తారనడం నిరాధారం. కేంద్ర కార్యదర్శులు సైతం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు' అని వివరణ ఇచ్చింది. 
 
కాగా, ఈ వార్తలు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వ్యాఖ్యానించారు. లాక్ డౌన్‌ను పొడిగించే ఎటువంటి ఆలోచనా కేంద్రం చేయడం లేదని అన్నారు. అయితే, ఏప్రిల్ 15వ తేదీ వరకు ఖచ్చితంగా లాక్‌డౌన్ పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments