Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (14:47 IST)
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు రోజుకు 1000 మంది భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతిస్తుండగా... వారాంతంలో మాత్రం ఆ సంఖ్యను 2వేలకు పరిమితి చేసింది. 
 
ఇక రోజు అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా అనుమతి ఇవ్వాలని ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. అయితే అన్ని శాఖలతో ప్రభుత్వం చర్చించాకే దీనిపై తుది నిర్ణయం వెలువడుతుందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఇక కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఆలయం మూత పడింది. దీంతో భక్తుల దర్శనం లేక ఆలయం కూడా ఆర్థికంగా చితికిపోయింది.
 
ఇక నిలక్కల్ దగ్గర కరోనా పరీక్ష కేంద్రాల నుంచి సన్నిధానం వద్ద ఉన్న శానిటైజేషన్ వ్యవస్థ వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.లాక్‌డౌన్‌కు ముందు సీజన్ సమయంలో రోజుకు 80వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వారని... ఆ సమయంలో రూ.263 కోట్లు మేరా రెవిన్యూ వచ్చేదని అధికారులు తెలిపారు. 
 
ఇక ఈ సారి ఆంక్షలు అమల్లోకి రావడంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల టెండర్లకు దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక ఈ సారి హుండీ ఆదాయం కూడా చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments