Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ వాహనాలకు చెక్.. ఇకపై అధికారులకు ట్యాక్సీలే అద్దె వాహనాలు.. కేంద్ర నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ అధికారులంతా ఇకపై ట్యాక్సీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాలను వినియోగించడానికి వీల్లే

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:37 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ అధికారులంతా ఇకపై ట్యాక్సీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాలను వినియోగించడానికి వీల్లేకుండా ఆదేశాలను జారీ చేయనుంది. పైగా, ఈ రిజిస్టర్ ట్యాక్సీలనే అద్దె వాహనాలుగా పరిగణించనుంది. 
 
అనేక అధికారులు ప్రభుత్వ సొమ్ముతో విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసిన వాటిలో తిరగుతుంటారు. మరికొంతమంది ప్రభుత్వ అధికారులు వారి కుటుంబసభ్యులు.. బంధువుల పేరుమీద విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసి వాటినే అధికారిక వాహనాలుగా లీజుకు తీసుకుంటున్నారు. ఈ విషయం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ నిగ్గు తేల్చింది. దీనిపై ఓ నివేదికను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సమర్పించింది.
 
దీంతో ఇకపై అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన కార్లను కాకుండా.. కేవలం ట్యాక్సీగా రిజిస్టర్‌ అయిన కార్లనే వినియోగించాలని ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. అంతేకాదు.. ట్యాక్సీ ఎంత దూరం ప్రయాణించింది.. ఏ పనిపై తీసుకుకెళ్లారన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపింది. 

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments