Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్ : గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి.. తారా స్థాయికి మాటల యుద్ధం

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిల మధ్య మాటల వాగ్యుద్ధం తారా స్థాయికి చేరింది. రాష్ట్రంలోని టోల్‌ప్లాజాల వద్ద సైన్యాన్ని మొహరించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టార

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (12:51 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిల మధ్య మాటల వాగ్యుద్ధం తారా స్థాయికి చేరింది. రాష్ట్రంలోని టోల్‌ప్లాజాల వద్ద సైన్యాన్ని మొహరించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. పైగా, గత మూడు రోజులుగా ఆమె ఆందోళన చేస్తున్నారు. 
 
దీనిపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ స్పందించారు. 'ఆర్మీలాంటి బాధ్యతాయుతమైన వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదు' అని అన్నారు. 
 
దీనికి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. 'గవర్నర్ కేంద్ర ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నారు. ఆయన ఎనిమిది రోజులుగా నగరంలో లేరు. ఏదైనా మాట్లాడేముందు అన్ని వివరాలను సరిచూసుకోవాల్సింది. ఆయన ఇలా మాట్లాడటం దురదృష్టకరం' అన్నారు. 
 
ఈ మాటలపై కూడా గవర్నర్ స్పందించారు. 'నేనేం చెప్పానో ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. వాళ్ల కిష్టమొచ్చింది (మమతా బెనర్జీ తదితరులు) మాట్లాడుకోని. నేను నా విధులు నిర్వర్తిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో భారత ఆర్మీని రాజకీయం చేయొద్దు.. విమర్శలు చేయకూడదు' అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments