Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుస్తుండగా కాలు స్లిప్ అయిన వైనం.. కిందపడిన గవర్నర్ తమిళిసై

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (11:10 IST)
తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అదుపుతప్పి కాలుజారి కిందపడ్డారు. ఆమె నడుస్తుండగా కాలు స్లిప్ అయింది. దీంతో ఆమె కిందడ్డారు. అయితే, ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం వద్ద ఆదివారం హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఈ ఉపగ్రహాలను తయారు చేశారు. 150 పైకో శాటిలైట్లను ఒక రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. ఈ తరహా రాకెట్ ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. 
 
కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె ప్రసంగించేందుకు వేదిక వద్దకు వెళుతుండగా కాలు స్లిప్ అయి తూలి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను పైకి లేపి నిల్చోబెట్టారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, తనకు ఎలాంటి గాయాలు తగలలేదని తాను కిందపడిపోయినందుకు టీవీల్లో మాత్రం ఈ వార్త హైలెట్ అవుతుందని చమత్కరించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments