Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 మంది బాలికలపై ప్రభుత్వోద్యోగి అత్యాచారం..ఎక్కడో తెలుసా?

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (08:25 IST)
పదేళ్లుగా 50 మంది బాలికలపై ఓ ప్రభుత్వోద్యోగి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన యూపీలో వెలుగు చూసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఓ జూనియర్‌ ఇంజనీర్‌ను ఎట్టకేలకు సిబిఐ అధికారులు అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.

కేసు వివరాలు పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామ్‌భవన్‌ అనే వ్యక్తి ఇరిగేషన్‌ శాఖలో జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. పైకి ఎంతో బాధ్యతగా కనిపించే ఇతను కనిపించిన ప్రతి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేవాడు.

చిత్రకూట్‌, హామీర్పూర్‌, బండా ప్రాంతాల్లో పేద బాలికలను టార్గెట్‌గా చేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫొటోలు, వీడియోలు తీసి ఇతరులకు పంపించేవాడని తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎరగా వేసి బెదిరించేవాడని దర్యాప్తులో తేలింది.

గతంలో ఎప్పటి నుండో ఇతనిపై లైంగిక ఆరోణలున్నప్పటికీ సాక్ష్యాలు లభించలేదు. దీంతో యుపి పోలీసులు ఈ కేసును సిబిఐకి అప్పగించారు. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అతని నివాసంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

పెద్దఎత్తున సిడిలు, మొబైల్‌ఫోన్లు, కొంతమంది బాలికల ఫొటోలు బయటపడ్డాయి. దీంతో అతనిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై యూపీనే కాకుండా యావత్‌ దేశం విస్తుపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం