Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో పనిచేసే ఆఫీసులోనే ఉద్యోగి సూసైడ్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (17:05 IST)
కరోనా వైరస్ భయం కారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి తాను పని చేసే కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహ్రాన్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు కరోనా వైరస్ బారినపడతామనే భయం పట్టుకుంది. దీంతో తాను ప‌నిచేసి కార్యాల‌యంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని జేబులో ఓ సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ తెలిపారు. 
 
క‌రోనా వైర‌స్ మాన‌సికంగా త‌న‌ను కుంగ‌దీసింద‌ని, అందుకే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నాని ఆ లేఖ‌లో రాసి ఉంద‌ని ఎస్పీ చెప్పారు. మృతుడి కుటుంబ‌స‌భ్యులు కూడా లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి అత‌ను తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో ఉన్న‌ట్లు కనిపించాడ‌ని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments