Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పృథ్వీరాజ్‌తో సహా బ్లెస్సీ యూనిట్.. ఎడారిలో చిక్కుకుపోయింది.. ఆకలితో..?

పృథ్వీరాజ్‌తో సహా బ్లెస్సీ యూనిట్.. ఎడారిలో చిక్కుకుపోయింది.. ఆకలితో..?
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (12:35 IST)
Prithivraj
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా, బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆడు జీవితం' పేరిట ఓ చిత్ర నిర్మాణం మొదలైంది. కథలో భాగంగా సినిమా షూటింగ్‌ను జోర్డాన్ ఎడారిలో జరపాలని భావించారు. అక్క‌డి ప‌రిస్థితులు బాగోలేవ‌ని కొందరు చెప్పినా, చిత్ర యూనిట్ వినకుండా అక్కడికి వెళ్లింది. చివరికి అక్కడికి వెళ్లిన తరువాత క‌రోనా తీవ్ర‌రూపం దాల్చింది. 
 
భారత దేశంతో పాటు పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానాలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో, వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తిండి లేక నానా ఇబ్బంది పడుతున్నారట. తమను ఎలాగైనా భారత్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని యూనిట్ సభ్యులు కోరుతున్నారు. 
 
జోర్డాన్‌లోని ఎడారి ప్రాంతంలోకి వెళ్లిన బ్లెస్సీ యూనిట్.. ఎటూ కదిలే దారి లేక, యూనిట్ మొత్తం ఆకలి బాధలు పడుతోందట. వారిని ఎలాగైనా వెనక్కు రప్పించాలని మాలీవుడ్ ప్రముఖులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నటుడు పృథ్వీరాజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ముందుగా ప్లాన్ చేసుకున్న రీతిలో వసతి, ఆహారం, సామాగ్రి వుందని.. కానీ ఆ తర్వాత ఏమౌతుందో ఏమోనని తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో భార్యాపిల్లలు, కన్నీళ్ళు పెట్టుకున్న మంచు విష్ణు