Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది యూట్యూబ్ చానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (15:20 IST)
భారత్‌కు వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఎనిమిది యూట్యూబ్ చానెళ్ళపై నిషేధం విధించింది. వీటిలో ఏడు చానెళ్లు భారత్‌కు చెందినవికాగా, మరొకటి పాకిస్థాన్‌కు చెందిన చానెల్ ఉంది. ఈ చానళ్లు నకిలీ, భారత్ వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చానెళ్ళపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. 
 
తాజాగా బ్లాక్ చేసిన చానెళ్ళ సంఖ్య 102కు చేరింది. ఒక ఫేస్‌బుక్ అకౌంటెట్‌తో పాటు ఆ ఫ్లాట్‌ఫామ్‌పై రెండు పోస్టులను కూడా కేంద్రం బ్లాక్ చేసినట్టు కేంద్ర టెలికాం, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ తెలిపింది. 
 
కాగా, ఈ 8 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌కు మొత్తం 86 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోల‌ను చూశార‌ని, అయితే ఆ ఛాన‌ళ్లు విద్వేషాన్ని రెచ్చ‌గొడుతోంద‌ని, మ‌త వ్య‌తిరేక ప్ర‌చారాలు చేస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి కేంద్రానికి నివేదించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments