Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ మదుపరుల సదస్సు : భోజన ప్లేట్ల కోసం ఎగబడ్డారు (Video)

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (16:53 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ప్రపంచ మదుపరుల శిఖరాగ్ర సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పెట్టుబడిదారులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నాయి. ముఖ్యంగా, భోజన ఏర్పాట్లలో ఈ సమస్య కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో ఈ సదస్సుకు వచ్చిన సామాన్య ప్రజలు భోజల ప్లేట్ల కోసం ఒక్కసారిగా ఎగడ్డారు. ఒకానొక సందర్భంగా వీటికోసం వారు కొట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
 
ఈ సదస్సుకు అతిథులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ, సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో వారంతా ప్లేట్ల కోసం పోటీపడ్డారు. దీంతో కొన్నిప్లేట్లు విరిగికిందపడ్డాయి. ఈ దృశ్యాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ సదస్సులో ఇలాంటి ఏర్పాట్లు బాధాకరమంటూ మండిపడ్డారు. కాగా, ఈ సదస్సు ఈ నెల 24, 25వ తేదీల్లో జరిగింది. ఇందులో తమ రాష్ట్రంలో రూ.26.16 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత ఒప్పందాల్లో అమలైతే రాష్ట్రంలో 17.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments