Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక యువతి... ఆరుగురు మృగాళ్లు... ఏ విధంగా వేధిస్తున్నారో చూడండి (వీడియో)

బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టంలో కీలక సవరణలు చేసింది. 12 యేళ్ల బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణ దండన విధించేలా సవరణ చేశారు. అయినప్పటికీ.. కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. పైగా, ఈ

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (17:39 IST)
బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టంలో కీలక సవరణలు చేసింది. 12 యేళ్ల బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణ దండన విధించేలా సవరణ చేశారు. అయినప్పటికీ.. కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. పైగా, ఈ అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
 
తాజాగా సోషల్ మీడియా వీడియో ద్వారా ఓ టీనేజ్ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో జరిగింది. నడి రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ యువతిని ఆరుగురు మృగాళ్లు విరుచుకుపడ్డారు. తన బట్టలు విప్పుతూ పైశాచికానందాన్ని పొందారు. 
 
ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడే తప్ప వాళ్లను నిలువరించలేదు. ఆ అమ్మాయి వాళ్లతో పోరాడి ఓడింది. నడిరోడ్డు మీదే ఆ అమ్మాయి బట్టలు విప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో చివరకు పోలీసులకు చేరడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మృగాళ్ల వేటలో పడ్డారు. అమ్మాయిపై అటాక్ చేసిన వ్యక్తుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments