Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందుకు బాలికను చంపేశారు..

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (19:19 IST)
ఉన్నత విద్య చదవాలని చాలా మంది కోరిక. అలాంటి ప్రయత్నం చేసినందుకు గానూ ఓ బాలికను కొంతమంది దుండగులు చంపేశారు. ఈ దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సాన్పూరా గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆశ(17) అనే అమ్మాయి ఇంటర్మీడియట్‌ చదువుతోంది. 
 
అయితే వీరి తెగ ఆచారాల ప్రకారం అమ్మాయిలు పదో తరగతి వరకు మాత్రమే చదవాలి. ఆ తర్వాత చదవకూడదు. కానీ ఆశ మాత్రం ఇంటర్మీడియట్‌లో చేరింది. దీంతో ఆ తెగకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఆశ ఉన్నత విద్య చదవడం ఇష్టం లేక ఆమెను దారుణంగా చంపేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. 
 
అయితే ఆశ సోదరుడు బాబన్ రాయ్ ఆదివారం సాయంత్రం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఏడుగురు వ్యక్తులలో నలుగురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments