Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ బాలిక ప్రాణం తీసింది.. కడుపు నొప్పితో కుప్పకూలింది..

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:43 IST)
లాక్ డౌన్ కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బతుకుదెరువు కోసం వెళ్లిన బాలిక ఇంటికి కొద్ది దూరంలో చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాకు చెందిన జమ్లో మక్దం(12) అనే బాలిక రెండు నెలల క్రితం తెలంగాణకు బతుకుదెరువు కోసం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో మిరప తోటలో పనికి చేరింది ఆ బాలిక. 
 
లాక్‌డౌన్‌ కారణంగా పనులు ఆగిపోయాయి. పూట గడవడం లేదు. దీంచో ఊరెళ్లాలని సదరు బాలికతో పాటు మరో 11 మంది నిర్ణయించుకున్నారు. దీంతో ఏప్రిల్‌ 15వ తేదీన తాము పని చేస్తున్న మిరప తోట ప్రాంతం నుంచి బీజాపూర్‌కు కాలినడకన బయల్దేరారు.
 
రహదారి వెంట వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని భావించి.. వారు అడవి మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తానికి ఆ బాలిక గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పితో బాలిక బాధపడింది. అక్కడే కుప్పకూలిపోయింది.
 
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ బాలికకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. పోషకాహారం వల్లే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments