చితికి నిప్పంటించగానే లేచి కూర్చొంది.. ఆస్పత్రికి వెళ్ళగానే చనిపోయింది...

పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి నిప్పంటించారు. కానీ, ఆ యువతిలో చలనం కనిపించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తుదిశ్వాస విడిచింది. తాజాగా

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:50 IST)
పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి నిప్పంటించారు. కానీ, ఆ యువతిలో చలనం కనిపించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తుదిశ్వాస విడిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని చత్రాకు సమీపంలోని సోఖా ప్రాంతానికి చెందిన అమర్‌ చౌదరి కుమార్తె క్రాంతి కుమారి(16). ఈ యువతి ఆరుబయట నిద్రిస్తుండగా పాము కరిచింది. విష ప్రభావంతో స్పృహ కోల్పోయింది. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారు ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. అయితే క్రాంతి కుమారిలో ఎటువంటి చలనం లేకపోవడంతో మృతి చెందిందనే నిర్ధారణకు వచ్చారు. 
 
ఆ తర్వాత కుమారికి కర్మకాండలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసి మృతదేహాన్ని శ్మశానికి కూడా తీసుకెళ్లారు. భౌతికకాయాన్ని చితిపై పెట్టి... నిప్పు అంటించగానే ఆ యువతి చేతులు కదిలించింది. దీంతో ఆ యువతిని కిందికి దించి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు పెద్దాస్పత్రికి తరలిస్తుండగా యువతి కన్నుమూసింది. దీంతో తొలుత సిద్ధం చేసిన చితిపైనే దహన సంస్కారాలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments