Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీయని మాటలు చెప్పి ఎంపీనే బుట్టలో వేసుకున్న కి'లేడీ'

ఓ కిలాడీ యువతి చెప్పిన తియ్యటి మాటలకు ఓ ఎంపీ బుట్టలో పడిపోయాడు. ఆ తర్వాత ఆ ఎంపీని తన ఇంటికి పిలిచి... మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చింది. పిమ్మట పడకగదిలోకి తీసుకుని బట్టలూడదీసి వీడియో తీసి.. దాని చూ

Webdunia
సోమవారం, 1 మే 2017 (09:38 IST)
ఓ కిలాడీ యువతి చెప్పిన తియ్యటి మాటలకు ఓ ఎంపీ బుట్టలో పడిపోయాడు. ఆ తర్వాత ఆ ఎంపీని తన ఇంటికి పిలిచి... మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చింది. పిమ్మట పడకగదిలోకి తీసుకుని బట్టలూడదీసి వీడియో తీసి.. దాని చూపి బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఢిల్లీలోని ఓ ఎంపీ వద్దకు ఓ మహిళ సాయం కోసం వచ్చింది. ఆ తర్వాత ఆమె చెప్పిన తీయని మాటలకు ఆ ఎంపీ లొంగిపోయాడు. ఆ తర్వాత ఘజియాబాద్‌లోని తన ఇంటికి పిలిచింది. అక్కడ కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చింది. దాన్ని సేవించగానే ఆ ఎంపీ మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత తాను అనుకున్న పనిని ఆ మహిళ పూర్తి చేసింది. 
 
ముఖ్యంగా ఎంపీతో సన్నిహితంగా ఉన్నట్లు అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియో తీసింది. ఈ వీడియో, ఫోటోలు చూపించి రూ.5 కోట్లు ఇవ్వాలని లేకుంటే అత్యాచారం కేసు పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఈ వేధింపులు తట్టుకోలేని ఆ ఎంపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఎంపీ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 384 కింద కేసు నమోదు చేసి, ప్రత్యేక క్రైం బ్రాంచ్ బృందంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ ముఖేష్ మీనా చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఎంపీ పేరును పోలీసులు వెల్లడించలేదు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments