Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుందని కుమార్తెను హత్య చేసిన తల్లి

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (17:35 IST)
తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి కన్నబిడ్డను హత్య చేసింది. ఈ విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. పైగా, హత్య కేసులో ఇరుక్కోకుండా ఆధారాలను మాయం చేసింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఘజియాబాద్‌లో ఒక యువతి మృతదేహాన్ని బైక్‌పై కొందరు తీసుకువెళుండటాన్ని గమనించిన సంగమ్ విహార్‌వాసులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, పలు విషయాలు వెల్లడించారు. ఓ యువతి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 42 యేళ్ల మహిళ కూడా ఉంది.
 
ఆమె పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. తన కుమార్తె బాయ్‌ప్రెండ్‌తో తిరుగుతుండటాన్ని గమనించి, గత మూడు నెలల్లో 8 అద్దె ఇళ్లను మార్చామని, అయినప్పటికీ తన కుమార్తె తీరులో మార్పురాలేదని వాపోయింది. ఈ కారణంగానే ఆమెను హత్య చేసినట్టు అంగీకరించింది. తన కుమారుడు స్నేహితులతో కలిసి మృతదేహాన్ని తరలిస్తుండగాచిక్కినట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments