Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ యువతకు 10 లక్షల ఉద్యోగాలు: ప్రధానమంత్రికి రాసిన లేఖలో గరుడ ఏరోస్పేస్‌ అగ్నీశ్వర్‌ జయప్రకాష్‌ వాగ్దానం

Webdunia
సోమవారం, 30 మే 2022 (18:39 IST)
సుప్రసిద్ధ భారతీయ డ్రోన్‌ స్టార్టప్‌ గరుడ ఏరోస్పేస్‌ , భారతదేశంలో ఈ విభాగంలో అగ్రగామిగా వెలుగొందుతూనే ఆవిష్కరణలనూ చేస్తోంది. సమగ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని భారతదేశంలో డ్రోన్ల వినియోగం కోసం సృష్టిస్తామంటూ గరుడ, ఏరోస్పేస్‌ ఇటీవలనే భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌ 2022 మొదటి ఎడిషన్‌లో పాల్గొంది. అక్కడ విభిన్న రంగాల కోసం తమ సాంకేతిక ఆఫరింగ్స్‌ను ప్రదర్శించింది. భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌ 2022ను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ద్వారా ప్రపంచంలో నిష్ణాతులైన డ్రోన్‌ నిపుణునిగా ఇండియాను నిలుపడం లక్ష్యంగా చేసుకున్నారు.

 
భారత ప్రధానికి ధన్యవాదములు తెలిపిన గరుడ ఏరోస్పేస్‌ సీఈవో అగ్నీశ్వర్‌ జయప్రకాష్‌ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ బహిరంగ లేఖను అందజేశారు. ఆ లేఖలో అగ్నీశ్వర్‌ మాట్లాడుతూ, ‘‘గత 8 సంవత్సరాలుగా భారతదేశంలో నిశ్శబ్దంగా డ్రోన్‌ విప్లవం జరుగుతుంది. మన దేశంలో ప్రస్తుతం డ్రోన్స్‌ పర్యావరణ వ్యవస్ధ గణనీయంగా వృద్ధి చెందింది. మన చురుకైన విధానాలు దీనికి తోడ్పడుతున్నాయి. డ్రోన్ల పరంగా అంతర్జాతీయంగా అత్యుత్తమమైనవిగా నిలపాలనేది తమ విధానం. దాదాపు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రయత్నిస్తున్నాను’’ అని అన్నారు.

 
ప్రస్తుతం 250 మిలియన్‌ డాలర్ల కంపెనీగా గుర్తింపు పొందిన గరుడ, భారతదేశంలో అత్యంత విలువైన డ్రోన్‌ స్టార్టప్‌గా గుర్తింపు పొందిన సంస్థ. భారతదేశపు మొట్టమొదటి డ్రోన్‌ యునికార్న్‌గా గుర్తింపు పొందింది. గరుడ ఫ్లీట్‌లో 300 డ్రోన్లు, 500 పైలెట్స్‌, 200 ముఖ్యమైన ఇంజినీర్లు 26 నగరాలలో కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. ఇది 30 విభిన్న రకాల డ్రోన్లు తయారుచేయడంతో పాటుగా 45 రకాల సేవలనూ అందిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments