Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదవి ఇప్పిస్తానంటూ రెండేళ్లుగా అత్యాచారం... యూపీ మంత్రిపై రేప్ కేసు

పార్టీలో పదవి ఇప్పిస్తానంటూ ఓ మహిళపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడింది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాదీ నేత గాయత్రీ ప్రజాపతి కా

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (09:49 IST)
పార్టీలో పదవి ఇప్పిస్తానంటూ ఓ మహిళపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడింది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాదీ నేత గాయత్రీ ప్రజాపతి కావడం గమనార్హం. దీంతో ఆయనపై సామూహిక అత్యాచారం కేసు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
35 ఏళ్ల మహిళ ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం శుక్రవారం యూపీ పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘నాకు సమాజ్‌వాదీ పార్టీలో మంచి పదవి ఇస్తామంటూ మంత్రి ప్రజాపతి ఆశ చూపారు. ఆయనతోపాటు మరికొందరు రెండేళ్లుగా నాపై అత్యాచారం చేస్తున్నారు. నా కుమార్తెను కూడా లైంగికంగా వేధించారు’’ అని చిత్రకూట్‌ ప్రాంతానికి చెందిన మహిళ ఆరోపించింది. 
 
దీనిపై ఆమె ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, వారు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అఖిలేశ్‌ కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పని చేస్తున్న ప్రజాపతి... ములాయంసింగ్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో యూపీ పోలీసులు ప్రజాపతిపై కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

తర్వాతి కథనం