Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్తాన్‌ పై ప్రధాని మోడీయే తుది నిర్ణయం:గడ్కరీ

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:13 IST)
ఆఫ్ఘనిస్తాన్‌ దేశంలో మౌలిక సదుపాయాల పెట్టుబడుల కొనసాగింపుపై ప్రధాని మోడీయే తుది నిర్ణయం తీసుకుంటారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయాలు ఉంటాయన్నారు. ఆ దేశంలో భారత్‌ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇప్పటికే పలు పూర్తి కాగా, ఇంకొన్ని పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.

'ఆఫ్ఘనిస్తాన్‌లో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో మేం పనిచేశాం. సల్దా డ్యామ్‌ను నిర్మించాం' అని గడ్కరీ తెలిపారు. ''ఒక స్నేహపూర్వక దేశంగా పలు రహదారుల నిర్మాణానికి సంబంధించి గతంలో ఆఫ్ఘన్‌ ప్రభుత్వ అధికారులతో చర్చించాం.

ప్రస్తుతం అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి రోడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం మంచిది..'' అని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వివిధ సంక్షేమ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్‌ ఇప్పటికే దాదాపు 300 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments