Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత 74 గణతంత్ర వేడుకలు - పద్మ పురస్కారాలు ఇవే

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (11:47 IST)
భారత 74వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన ఈ పురస్కారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 12 మందికి ఈ పురస్కారాలు వరించాయి. వీరిలో సుమధుర గేయవాణి వాణీ జయరాం, స్వరకర్త కీరవాణిలు ఉన్నారు. అలాగే, చినజీయర్ స్వామికి పద్మ భూషణ్‌ ప్రకటించారు.
 
ఈ యేడాది మొత్తం 106కి పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో 6 పద్మ విభూషణ, 9 పద్మభూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. అందులో చినజీయర్ స్వామికి పద్మ భూషణ్, సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇక తమిళనాడు నుంచి ఐదుగురు, పుదుచ్చేరి నుంచి ఒకరిని పద్మ పురస్కారాల కోసం ఎంపిక చేశారు. తమిళనాడు కోటాలో సీనియర్ గాయని వాణీ జయరాంకు పురస్కారం దక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments