Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇత్తడి పాత్రలో వేడినీరు.. పడిపోయిన పాపాయి.. చివరికి ఏమైందంటే?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (15:23 IST)
Hot Water
తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని పెరియపాళయంలో వేడినీటిలో నాలుగేళ్ల పాపాయి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పెరియపాళయంకు సమీపంలో తిరుక్కండలం తలైయారీ వీధికి చెందిన గజేంద్రన్- కుప్పమ్మాళ్ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె వుంది. కుప్పమ్మ పాపాయి స్నానానికి వేడినీళ్లు తోడింది. 
 
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఇత్తడి పాత్రలో వేడినీటిని బాత్రూమ్‌లో పెట్టి పొయ్యిని ఆఫ్ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లిన పాప.. వేడినీటిని వుంచిన ఇత్తడి పాత్రలో పడిపోయింది. దీంతో పాప పెద్దగా అరిచిన శబ్ధం విని పరుగులు పెట్టిన కుప్పమ్మ.. బిడ్డను ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స ఫలించక నాలుగేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాధాన్ని మిగిల్చింది. కళ్లముందే వేడినీటిలో పడి పాపాయి విలవిలలాడిన దృశ్యాలు ఆ తల్లిని షాక్ ఇచ్చాయి. ఇంకా తన బిడ్డ ఇక లేదనే నిజాన్ని కుప్పమ్మ జీర్ణించుకోలేక బోరున విలపించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments