Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇత్తడి పాత్రలో వేడినీరు.. పడిపోయిన పాపాయి.. చివరికి ఏమైందంటే?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (15:23 IST)
Hot Water
తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని పెరియపాళయంలో వేడినీటిలో నాలుగేళ్ల పాపాయి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పెరియపాళయంకు సమీపంలో తిరుక్కండలం తలైయారీ వీధికి చెందిన గజేంద్రన్- కుప్పమ్మాళ్ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె వుంది. కుప్పమ్మ పాపాయి స్నానానికి వేడినీళ్లు తోడింది. 
 
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఇత్తడి పాత్రలో వేడినీటిని బాత్రూమ్‌లో పెట్టి పొయ్యిని ఆఫ్ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లిన పాప.. వేడినీటిని వుంచిన ఇత్తడి పాత్రలో పడిపోయింది. దీంతో పాప పెద్దగా అరిచిన శబ్ధం విని పరుగులు పెట్టిన కుప్పమ్మ.. బిడ్డను ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స ఫలించక నాలుగేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాధాన్ని మిగిల్చింది. కళ్లముందే వేడినీటిలో పడి పాపాయి విలవిలలాడిన దృశ్యాలు ఆ తల్లిని షాక్ ఇచ్చాయి. ఇంకా తన బిడ్డ ఇక లేదనే నిజాన్ని కుప్పమ్మ జీర్ణించుకోలేక బోరున విలపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments