Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇత్తడి పాత్రలో వేడినీరు.. పడిపోయిన పాపాయి.. చివరికి ఏమైందంటే?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (15:23 IST)
Hot Water
తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని పెరియపాళయంలో వేడినీటిలో నాలుగేళ్ల పాపాయి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పెరియపాళయంకు సమీపంలో తిరుక్కండలం తలైయారీ వీధికి చెందిన గజేంద్రన్- కుప్పమ్మాళ్ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె వుంది. కుప్పమ్మ పాపాయి స్నానానికి వేడినీళ్లు తోడింది. 
 
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఇత్తడి పాత్రలో వేడినీటిని బాత్రూమ్‌లో పెట్టి పొయ్యిని ఆఫ్ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లిన పాప.. వేడినీటిని వుంచిన ఇత్తడి పాత్రలో పడిపోయింది. దీంతో పాప పెద్దగా అరిచిన శబ్ధం విని పరుగులు పెట్టిన కుప్పమ్మ.. బిడ్డను ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స ఫలించక నాలుగేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాధాన్ని మిగిల్చింది. కళ్లముందే వేడినీటిలో పడి పాపాయి విలవిలలాడిన దృశ్యాలు ఆ తల్లిని షాక్ ఇచ్చాయి. ఇంకా తన బిడ్డ ఇక లేదనే నిజాన్ని కుప్పమ్మ జీర్ణించుకోలేక బోరున విలపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments