Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులూ జాగ్రత్త.. జెల్లీ మిఠాయి తిని చిన్నారి మృతి

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (11:03 IST)
అవును. జెల్లీ మిఠాయి కొనివ్వమని మారాం చేస్తే పిల్లలకు అస్సలు కొనివ్వకండి ఎందుకంటే.. జెల్లీ మిఠాయిని తిన్న చిన్నారి, తల్లి కంటిముందే స్పృహ తప్పి పడిపోయి... ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు, పెరంబళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెరంబళూరు జిల్లా, అన్నై నగర్ ప్రాంతానికి చెందిన ధర్మరాజ్ భార్య శశిదేవి. 
 
ఈమె తన నాలుగేళ్ల కుమారుడు రంగనాథన్‌ను తీసుకుని షాపుకు వెళ్లింది. ఇలా ఓ కొట్టులో ఐదు రూపాయలకు అమ్మబడే జెల్లీ మిఠాయిని రంగనాథన్‌కు కొనిపెట్టింది. దీన్ని తినిన ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోయాడు. 
 
వెంటనే కుమారుడిని ఆస్పత్రిలో చేర్చిన శశిదేవికి వైద్యులు షాకిచ్చే నిజాన్ని చెప్పారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీంతో శశిదేవి బోరున విలపించింది. జెల్లీ మిఠాయి గొంతులో చిక్కుకుపోవడం ద్వారానే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments