Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి పట్టాలు తప్పిన సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు..

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (11:29 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ వద్ద ఆదివారం అర్థరాత్రి రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం మాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఆదివారం అర్థరాత్రి ఒంటి గంటకురైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసుల హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
రాత్రి తామంతా గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్దం వినిపించిందని, చివరకు రైలు పట్టాలను తప్పినట్టు తెలిసిందని కొందరు ప్రయాణికులు వెల్లడించారు. కాగా, ఆర్పీఎఫ్ చెందిన సహాయక బృందాలు, రైల్వే పోలీసులు, అడిషినల్ డివిజనల్ రైల్వే మేనేజరు, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలంలోనే ఉడి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్ళీ పట్టాలపైకి మళ్లించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే పీఆర్వో శశికిరణ్ తెలిపారు. ప్రయాణికుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా హెల్ప్‌లైన్లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments