Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గు స్కామ్ : మాజీ కేంద్ర మంత్రికి మూడేళ్ళ జైలు!

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (15:56 IST)
బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కు మూడేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో ముగ్గురిని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. 
 
గత 1999లో జార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చా. ఈ కేసును సుధీర్ఘంగా విచారించిన కోర్టు దిలీప్ రేతో సహా మిగిలిన వారందరినీ దోషులుగా తేల్చింది. వీరికి సోమవారం శిక్షను ఖరారు చేసింది. 
 
దిలీప్‌ రేతో పాటు మరో ఇద్దరు దోషులకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.10 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. మరోవైపు, క్యాస్ట్రన్‌ టెక్‌కు రూ.60 లక్షలు, క్యాస్ట్రన్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు మరో రూ.10 లక్షల అదనపు జరిమానా విదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments