Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీతో భేటీ అయిన తుమ్మల నాగేశ్వరరావు

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (23:07 IST)
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. తుమ్మల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు ఢిల్లీ చేరుకుని రాహుల్ గాంధీని కలిశారు. పార్టీలో చేరిన తర్వాత యువనేతను కలవడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ పార్టీలో చేరిన రోజుకి సమయం ఇవ్వలేకపోయారు. దీంతో పాలనాధికారి తుమ్మలను పిలిపించారు. 
 
దాదాపు అరగంట పాటు రాహుల్ గాంధీ, తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
 
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు రాహుల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఇదిలావుంటే, పాలేరు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తుమ్మల కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతల నుంచి ఆ స్థానం కోసం పోటీ నెలకొంది. 
 
పాలేరు టికెట్ కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పాలేరు సీటుపై పోటీపై చర్చించేందుకు తుమ్మల ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్‌తో భేటీ అనంతరం పాలేరు, ఖమ్మం, కొత్తగూడెంలలో ఏ స్థానంలోనైనా పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments