Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ముఖ్యమంత్రి మనవరాలు ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (15:51 IST)
కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్డియూరప్ప మనవరాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె పేరు సౌందర్య నీరజ్ (30). యడ్డియూరప్ప పెద్ద కుమార్తె పద్మ కూతురు. బెంగుళూరులోని వసంత్ నగర్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్న ఇంటిలోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈమె బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. 
 
గత 2019లో డాక్టర్ సౌందర్యకు వివాహం జరిగింది. ఈమెకు ఓ పాప కూడా ఉన్నారు. అయితే ఆమె ఇంట్లో పని చేసే పని మనిషి శుక్రవారం ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎంత సేపటికీ ఆమె తలుపు తీయలేదు. దీంతో సౌందర్ భర్త నీరజ్‌కు ఫోన్ చేసి సమాచారం చేరవేసింది. 
 
ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి లోపలకు వెళ్లగా సౌందర్య ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రాథమిక ఆధారాల మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments