Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ముఖ్యమంత్రి మనవరాలు ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (15:51 IST)
కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్డియూరప్ప మనవరాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె పేరు సౌందర్య నీరజ్ (30). యడ్డియూరప్ప పెద్ద కుమార్తె పద్మ కూతురు. బెంగుళూరులోని వసంత్ నగర్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్న ఇంటిలోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈమె బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. 
 
గత 2019లో డాక్టర్ సౌందర్యకు వివాహం జరిగింది. ఈమెకు ఓ పాప కూడా ఉన్నారు. అయితే ఆమె ఇంట్లో పని చేసే పని మనిషి శుక్రవారం ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎంత సేపటికీ ఆమె తలుపు తీయలేదు. దీంతో సౌందర్ భర్త నీరజ్‌కు ఫోన్ చేసి సమాచారం చేరవేసింది. 
 
ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి లోపలకు వెళ్లగా సౌందర్య ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రాథమిక ఆధారాల మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments