Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ముఖ్యమంత్రి మనవరాలు ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (15:51 IST)
కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్డియూరప్ప మనవరాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె పేరు సౌందర్య నీరజ్ (30). యడ్డియూరప్ప పెద్ద కుమార్తె పద్మ కూతురు. బెంగుళూరులోని వసంత్ నగర్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్న ఇంటిలోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈమె బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. 
 
గత 2019లో డాక్టర్ సౌందర్యకు వివాహం జరిగింది. ఈమెకు ఓ పాప కూడా ఉన్నారు. అయితే ఆమె ఇంట్లో పని చేసే పని మనిషి శుక్రవారం ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎంత సేపటికీ ఆమె తలుపు తీయలేదు. దీంతో సౌందర్ భర్త నీరజ్‌కు ఫోన్ చేసి సమాచారం చేరవేసింది. 
 
ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి లోపలకు వెళ్లగా సౌందర్య ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రాథమిక ఆధారాల మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments