Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ ఎవరు? ఎన్వీ రమణకు ఛాన్స్ దక్కదా?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (07:48 IST)
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కమిటి (కొలీజియం)లో విభేదాలు పొడచూపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎవరన్నదానిపై సందిగ్ధత నెలకొంది. పైగా, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే కూడా తన వారసుడి విషయంలో మౌనంగా ఉంటున్నారు. దీంతో దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్నదానిపై చర్చ సాగుతోంది. 
 
వాస్తవానికి ప్రధాన న్యాయమూర్తే తన తదుపరి వారసుడుని ఎంపిక చేయడం ఆనవాయితీగా ఉంది. కానీ, ఈ దఫా అలా జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు కొత్త సీజేఐ ఎవరన్నదానిపై సందిగ్ధం కొనసాగుతున్నది. ప్రస్తుత సీజేఐ ఎస్‌ఏ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఇలా జరగడం గత ఐదేళ్ళలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
పైగా, సీజేఐ ఎవరు కావాలన్న అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కమిటీ (కొలీజియం) ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, రోహింగ్టన్‌ నారీమన్‌, యూయూ లలిత్‌, ఏఎం ఖాన్విల్కర్‌ ఉన్నారు. కొలీజియంలో ఏకాభిప్రాయం లేకపోవటంతో తదుపరి సీజేఐ ఎంపిక ముందుకు సాగటం లేదు. 
 
మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే, ఇందులో జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ ఎస్కే కౌల్‌, జస్టిస్‌ మోహన్‌ శంతనగౌడార్‌ పేర్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments