Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కుటుంబానికి చెందిన ఆ ఐదుగురు ఎలా మృతి చెందారు..

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:33 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం హర్యానాలో కలకలం రేపింది. ఈ ఘటనలో కుటుంబ పెద్ద ఉరేసుకుని ఉండగా.. అతని భార్య, ముగ్గురు పిల్లలు మరో గదిలో నేలపై పడి ఉన్నారు. ఈ విషాద ఘటన హర్యానాలోని పాల్వాల్‌ జిల్లాలోని ఔరంగాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్‌ గ్రామంలో బుధవారం ఉదయం నరేష్ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. చాలా సేపు ఎలాంటి కదలికలు లేకపోవడంతో స్థానికులు వారి ఇంటి తలుపులు తెరిచి చూశారు. అక్కడ నరేశ్ (33) ఉరేసుకుని కనిపించాడు. అతని భార్య ఆర్తి(30), పిల్లలు భావన (9), సంజయ్(7), బంధువుల కూతురు రవిత(11)ల మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. 
 
నరేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పాల్వాల్ నగర పోలీసు బృందం ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నరేష్ తన భార్య, పిల్లలకు విషం ఇచ్చి వారు చనిపోయిన తర్వాత అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments