Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులు బాణాసంచా దుకాణంలో పేలుడు.. ఐదుగురి మృతి

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (08:56 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో ఓ బాణాసంచా దుకాణంలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
శంకరాపురంలోని సెల్వగణపతి అనే వ్యక్తికి చెందిన టపాకాయాల దుకాణంలో ఈ పేలుడు సంభవించి, ఐదుగురు సజీవ దహనమయ్యారని జిల్లా కలెక్టర్ పిఎన్ శ్రీధర్ తెలిపారు. మరో 11 మంది కార్మికులు గాయపడ్డారని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. 
 
ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. సహాయక చర్యలు త్వరితగతిన పూర్తిచేశారు. ఈ టపాకాయల దుకాణానికి సమీపంలో ఉన్న ఓ బేకరీ షాపులో చెలరేగిన మంటలు నలువైపులా వ్యాపించాయి. దీంతో బాణాసంచా దుకాణానికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.ే

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments