Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధారావిలో తొలి కరోనా మృతి .. ఉలిక్కిపడిన అధికారులు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (11:52 IST)
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల మధ్య లక్షలాది మంది పేదలు నివాసం వుంటారు. ఇక్కడ పారిశుద్ధ్యం మాటెత్తితే అంతేసంగతులు. అదే ముంబైలోని మురికివాడ ప్రాంతం ధారావి. ఈ ప్రాంతంలో ఓ కరోనా మరణం సంభవించింది.

ధారావి వంటి ప్రాంతంలో కరోనా ప్రబలితే, దానిని అడ్డుకునే పరిస్థితి చాలా కష్టమని అధికారులు ఉలిక్కిపడ్డారు.  ప్రస్తుతం ధారావి ప్రాంతంలో దాదాపు 16 లక్షల మంది నివాసం ఉంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 59 కరోనా కేసులు బయటపడగా, ఆరుగురు మరణించారు.
 
ఈ నేపథ్యంలో ధారావిలో బుధవారం సాయంకాలం కరోనా తొలి మరణం నమోదైంది. కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న అతని రక్త నమూనాలను పరీక్షించగా, పాజిటివ్ వచ్చింది.

అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన వెళ్లి అతను ఉంటున్న భవనాన్ని సీల్ చేసి, భవనంలో అద్దె కుంటున్న 300 మందిని హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, ఆగ్రహంతో వారిపై రాళ్లు కూడా రువ్వడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments