Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు.. రెండు నెలల్లో రెండో ఘటన

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (16:41 IST)
కేరళ రాష్ట్రంలోని ఆళప్పుళ - కన్నూరు ప్రాంతాల మధ్య నడిచే ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కన్నూరు రైల్వే స్టషన్‌లో రైలు ఆగివున్న సమయంలో ఓ బోగీ నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్టేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలు చెలరేగిన బోగీల నుంచి ఇతర బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో స్టేషన్‌కు వచ్చిన మంటలను ఆర్పివేశాయి. 
 
ఒక బోగీ నుంచి మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మిగతా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బోగీలోకి ఎక్కిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. 
 
కాగా, ఏప్రిల్ 2వ తేదీన ఇదే రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. షారూక్ సఫీ అనే వ్యక్తి రైలు బోగీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇపుడు మళ్లీ అదే రైలులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments