Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆపరేషన్ గంగ' : ఢిల్లీకి చేరిన ఐదో విమానం

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:05 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా చిక్కుల్లో పడిన భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం "ఆపరేషన్ గంగ" అనే పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఈ విమానాల్లో ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, విద్యార్థులను సరిహద్దు దేశాలైన రొమేనియా, పోలాండ్ తదితర దేశాలకు తరలించి అక్కడ నుంచి స్వదేశానికి తీసుకొస్తుంది. 
 
ఈ 'ఆపరేషన్ గంగ'లో భాగంగా తొలి విమానం తొలుత ముంబైకు వచ్చింది. ఆ తర్వాత రెండో విమానం ఢిల్లీకి, మూడో విమానం హైదరాబాద్‌కు చేరుకోగా, నాలుగు, ఐదు విమానాలు ఢిల్లీకి వచ్చాయి. 
 
తాజాగా ఢిల్లీకి వచ్చిన ఐదో విమానంలో 249 మంది విద్యార్థులు, పౌరులు సురక్షితంగా మాతృభూమికి చేరుకున్నారు. వీరిలో ఏపీ, తెలంగాణాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. తెలంగాణాకు చెందిన 11 మంది, ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం