Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో మహిళా టీచర్లకు తప్పని వేధింపులు.. వీడియోలు చూపిస్తూ..?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (12:50 IST)
కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులంటూ ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ఇలా కష్టపడినా జీతాలు కూడా కొందరు ఉపాధ్యాయులు అందుకోవట్లేదు. ఇవి చాలదన్నట్లు కామాంధులు మాత్రం మహిళా ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న రిషబ్ అకాడమి స్కూల్ సెక్రటరీ రంజిత్ జైన్, ఆయన కుమారుడు అభినవ్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా టీచర్స్ ఆరోపించారు. తమకు ఎంతోకాలంగా జీతాలు చెల్లించడం లేదని, జీతం డిమాండ్ చేసినప్పుడల్లా పాఠశాల యాజమాన్యం మహిళా ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తిస్తుందని బాధితులు పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా మహిళా టాయిలెట్స్‌లో స్పై కెమెరాలు అమర్చినట్లుగా తెలిపారు. ఈ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ తమతో శారీరక సంబంధం పెట్టుకోవాల్సిందిగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతారన్నారు. యాజమాన్యం చెప్పుచేతుల్లోకి రాని మహిళా టీచర్లను అదుపులోకి తెచ్చుకునేందుకు మంత్రగాళ్లని సైతం ఆశ్రయిస్తారన్నారు. మహిళా ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం