Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో మహిళా టీచర్లకు తప్పని వేధింపులు.. వీడియోలు చూపిస్తూ..?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (12:50 IST)
కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులంటూ ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ఇలా కష్టపడినా జీతాలు కూడా కొందరు ఉపాధ్యాయులు అందుకోవట్లేదు. ఇవి చాలదన్నట్లు కామాంధులు మాత్రం మహిళా ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న రిషబ్ అకాడమి స్కూల్ సెక్రటరీ రంజిత్ జైన్, ఆయన కుమారుడు అభినవ్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా టీచర్స్ ఆరోపించారు. తమకు ఎంతోకాలంగా జీతాలు చెల్లించడం లేదని, జీతం డిమాండ్ చేసినప్పుడల్లా పాఠశాల యాజమాన్యం మహిళా ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తిస్తుందని బాధితులు పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా మహిళా టాయిలెట్స్‌లో స్పై కెమెరాలు అమర్చినట్లుగా తెలిపారు. ఈ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ తమతో శారీరక సంబంధం పెట్టుకోవాల్సిందిగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతారన్నారు. యాజమాన్యం చెప్పుచేతుల్లోకి రాని మహిళా టీచర్లను అదుపులోకి తెచ్చుకునేందుకు మంత్రగాళ్లని సైతం ఆశ్రయిస్తారన్నారు. మహిళా ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం