Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

సెల్వి
గురువారం, 27 మార్చి 2025 (12:11 IST)
యూపీలో దారుణం చోటుచేసుకుంది. యూపీ, రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 36 ఏళ్ల వ్యక్తి తన నలుగురు పిల్లలను గొంతు కోసి చంపి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గురువారం పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మన్పూర్ చాచారి గ్రామానికి చెందిన రాజీవ్ కుమార్ తన ముగ్గురు కుమార్తెలు స్మృతి (12), కీర్తి (9), ప్రగతి (7), ఐదేళ్ల కుమారుడు రిషబ్‌లను హత్య చేశాడని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది తెలిపారు. రాజీవ్ వారి గొంతులను పదునైన ఆయుధంతో కోసి బుధవారం రాత్రి తన ఇంట్లోని మరో గదిలో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. 
 
రాజీవ్ ఉదయం తలుపు తెరవకపోవడంతో, పైకప్పు ఎక్కి మెట్ల గుండా ఇంటి లోపలికి వెళ్ళి మృతదేహాలను వెలికితీశారు. ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో రాజీవ్ తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సంఘటన జరిగిన ముందు రోజు భార్య ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఈ సంఘటన వెనుక గల కారణం ఇంకా నిర్ధారించబడలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments