Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్ ర్యాలీ-సింఘూ సరిహద్దు వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లను దాటుకుని..?

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (09:49 IST)
Farmers Rally
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని చాలా రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు వారంతా ఢిల్లీ సరిహద్దులో కిసాన్ గణతంత్ర పెరేడ్ పేరిట భారీ ఎత్తున ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రతా వలయంలో వెళ్ళి పోయింది. ఈ ర్యాలీలో పాకిస్థాన్ అల్లర్లకు కుట్ర పన్నిందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
 
ముందు నుంచి రైతుల ర్యాలీకి అనుమతి లభించకపోగా చివరికి 37 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఢిల్లీ లోపల గణతంత్ర వేడుకలు పూర్తయ్యాక మాత్రమే ర్యాలీ ప్రారంభం అయ్యేలా అనుమతించారు. 
 
ఇక కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కానుండగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. సింఘూ సరిహద్దు వద్ద రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విచ్ఛిన్నం చేసి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments