రైతులకు హక్కులు కల్పించాలి: రాహుల్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:40 IST)
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి నిరసన తెలుపుతన్న రైతులకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి మద్దతు పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రం అహంకారాన్ని వీడి.. రైతులకు వారి హక్కులు కల్పించాలని అన్నారు. ‘మనకు అన్నం పెట్టే రైతన్నలు నేడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.. కానీ టీవీల్లో మాత్రం అబద్ధపు ప్రసంగాలు (ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

అన్నదాతల శ్రమకు మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. అలాంటి రైతులకు న్యాయం, హక్కులు కల్పించి రుణం తీర్చుకోవాలి.

వారిపై లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి కాదు. ఇకనైనా మేల్కోండి.. అహంకారమనే కుర్చీ నుంచి దిగి రైతులకు హక్కులు కల్పించండి’ అని కేంద్రానికి సూచిస్తూ ట్వీట్‌ చేశారు.
 
కాగా, కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను నిరసిస్తూ రైతులు ఆరు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments