Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు హక్కులు కల్పించాలి: రాహుల్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:40 IST)
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి నిరసన తెలుపుతన్న రైతులకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి మద్దతు పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రం అహంకారాన్ని వీడి.. రైతులకు వారి హక్కులు కల్పించాలని అన్నారు. ‘మనకు అన్నం పెట్టే రైతన్నలు నేడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.. కానీ టీవీల్లో మాత్రం అబద్ధపు ప్రసంగాలు (ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

అన్నదాతల శ్రమకు మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. అలాంటి రైతులకు న్యాయం, హక్కులు కల్పించి రుణం తీర్చుకోవాలి.

వారిపై లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి కాదు. ఇకనైనా మేల్కోండి.. అహంకారమనే కుర్చీ నుంచి దిగి రైతులకు హక్కులు కల్పించండి’ అని కేంద్రానికి సూచిస్తూ ట్వీట్‌ చేశారు.
 
కాగా, కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను నిరసిస్తూ రైతులు ఆరు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments