Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద ఉధృతిలో చిక్కుకున్న ఇద్దరు రైతులని కాపాడిన రెస్క్యూ సిబ్బంది

వరద ఉధృతిలో చిక్కుకున్న ఇద్దరు రైతులని కాపాడిన రెస్క్యూ సిబ్బంది
, గురువారం, 26 నవంబరు 2020 (17:09 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా రాగుళ్ళ వాగులో వరద ఉదృతి లో చిక్కుకున్న ఇద్దరు రైతులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు.  రెస్క్యూ సిబ్బందితో కలిసి ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. 
 
గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులు వరద ఉధృతి లో చిక్కుకున్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  రాగుళ్ళ వాగు వద్దకు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు.

మొదట  రైతులను కాపాడేందుకు హెలికాప్టర్లను తెప్పించారు. కాగా, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ల సహాయక చర్యలు ముందుకు సాగలేదు. వెను వెంటనే స్పీడ్ మోటార్ బోట్ లను తెప్పించి రైతులను కాపాడారు.  ఇద్దరు రైతులను కాపాడగలిగారు. మరో రైతు వరద ఉధృతి లో గల్లంతయ్యాడు. గల్లైంతైన రైతును కాపాడే  చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చేనెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమానాలను ర‌ద్దు