Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాన్‌ను మార్చేసిన రైతులు.. ఛలో పార్లమెంట్ వాయిదా

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (17:13 IST)
తమ డిమాండ్ల పరిష్కార సాధన కోసం గత యేడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల వెంబడి ఆందోళన చేస్తున్న రైతులు ఉన్నట్టుండి తమ ప్లాన్‌ను మార్చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు అన్నదాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఇందులోభాగంగా, పార్లమెంట్ ముట్టడి (ఛలో పార్లమెంట్) కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. కొత్త సాగు చట్టాల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే బిల్లును ప్రవేశపెట్టనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో రైతులు వ్యూహాత్మకంగా వాయిదావేశారు. ఈ మేరకు శనివారం సమావేశమైన అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా నేతలు నిర్ణయం తీసుకున్నారు. 
 
మరోవైపు, రైతులు తమ ఆందోళనను విరమించి, సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు జరిపేందుకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పిలుపునిచ్చారు. దీనిపై రైతు సంఘాల సమాఖ్య నేతలు స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments