Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేచి ఎవరి మొహం చూశాడో ఏమోకానీ..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (16:54 IST)
నిద్రలేచి ఎవరి మొహం చూశాడో ఏమోకానీ ఓ వ్యక్తి నిద్రలేవగానే ఇంటి పైకప్పుపై రెండు సంచుల్ని గుర్తించాడు. అందులో పెద్దమొత్తంలో నగదు వుండటంతో షాకయ్యాడు. అంతేగాకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ మేరఠ్‌లో నివాసం ఉండే పవన్‌ సింఘాల్‌ అనే వ్యాపారి ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పని చేసేవాడు. ఇతను రెండేళ్ల కిందట అక్కడి నుంచి వెళ్లిపోయి ఇటీవల తిరిగొచ్చాడు. ఆ సమయంలో ఇంటి యజమాని లేకపోవడంతో సెక్యురిటీగార్డుతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. 
 
దాదాపు రూ. 40 లక్షల నగదు ఉన్న రెండు సంచులతో వెళ్తే సీసీ కెమెరాల్లో నమోదై దొరుకుతాననే ఆలోచనతో వాటిని ఆ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిపై విసిరేశాడు. తర్వాత వచ్చి సంచులను తీసుకుందామని వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
 
ఈ క్రమంలో మరుసటి రోజు బుధవారం ఉదయం ఆ పక్కింట్లో ఉండే వరుణ్‌శర్మ తన ఇంటిపై ఉన్న సంచుల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎవరో డబ్బును దొంగిలించి ఇక్కడ పెట్టి ఉంటారనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దొంగతనానికి పాల్పడినట్లు తేలిన రాజు, సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments