Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ సమయంలో పీఎఫ్ నుంచి వేల కోట్లు నగదు విత్ డ్రా, కేంద్ర మంత్రి

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:14 IST)
మార్చి నెలలో లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఆగస్టు 31 వరకు తమ భవిష్య నిధి దాచుకున్న ఉద్యోగులు పెద్దఎత్తున నగదు విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. మార్చి నెల 25 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రూ. 39, 402.90 కోట్లను ఉద్యోగులు విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌కు లిఖిత పూర్వక సమాధానాన్ని పంపించారు.
 
ఈ ఐదు నెలల వ్యవధిలో మహారాష్ట్రకు చెందిన ఉద్యోగులు అత్యధికంగా నగదును విత్ డ్రా చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి రూ.7,837.80 కోట్లు విత్ డ్రా కాగా ఆ తర్వాత కర్ణాటక నుంచి రూ.5,743.90 కోట్లు, తమిళనాడు నుంచి రూ.4,984.50 కోట్లు విత్ డ్రా అయ్యాయని వెల్లడించారు. కరోనా కాలంలో కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీలు కోసం కేంద్రం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన, ఆత్మ నిర్బర్ భారత్ స్కీంల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా నెలకు రూ.15 వేలు కన్నా తక్కువ వేతనం పొందుతున్న వారు లబ్ధిని పొందారని తెలిపారు. మే నుంచి జూలై వరకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కూడా 12 నుంచి 10 శాతానికి తగ్గించామని సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. లాక్ డౌన్లో ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments