లాక్డౌన్ సమయంలో పీఎఫ్ నుంచి వేల కోట్లు నగదు విత్ డ్రా, కేంద్ర మంత్రి

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:14 IST)
మార్చి నెలలో లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఆగస్టు 31 వరకు తమ భవిష్య నిధి దాచుకున్న ఉద్యోగులు పెద్దఎత్తున నగదు విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. మార్చి నెల 25 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రూ. 39, 402.90 కోట్లను ఉద్యోగులు విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌కు లిఖిత పూర్వక సమాధానాన్ని పంపించారు.
 
ఈ ఐదు నెలల వ్యవధిలో మహారాష్ట్రకు చెందిన ఉద్యోగులు అత్యధికంగా నగదును విత్ డ్రా చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి రూ.7,837.80 కోట్లు విత్ డ్రా కాగా ఆ తర్వాత కర్ణాటక నుంచి రూ.5,743.90 కోట్లు, తమిళనాడు నుంచి రూ.4,984.50 కోట్లు విత్ డ్రా అయ్యాయని వెల్లడించారు. కరోనా కాలంలో కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీలు కోసం కేంద్రం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన, ఆత్మ నిర్బర్ భారత్ స్కీంల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా నెలకు రూ.15 వేలు కన్నా తక్కువ వేతనం పొందుతున్న వారు లబ్ధిని పొందారని తెలిపారు. మే నుంచి జూలై వరకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కూడా 12 నుంచి 10 శాతానికి తగ్గించామని సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. లాక్ డౌన్లో ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments