బజ్వాను సిద్దూ కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామం: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:19 IST)
‘‘సిద్ధూ విషయంలో అమరీందర్ వైఖరి సరైందే. సిద్దూ పాకిస్తాన్ వెళ్లి బజ్వాను కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామం. అమరీందర్ చెప్పింది కరెక్టే. సిద్ధూ మోసగాడు’’ అని కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలె అన్నారు.

పంజాబ్ తాజా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి రావాలంటూ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే వచ్చే పంజాబ్ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు.

ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్‌ను తీవ్రంగా అవమానించింది. అలాంటి పార్టీలో ఆయన ఉండాల్సిన అవసరం లేదు.

కాంగ్రెస్ పార్టీ వీడి ఎన్డీయేలోకి రావాలని నేను ఆయనకు విజ్ణప్తి చేస్తున్నాను. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుంది. అంతే కాదు, కెప్టెన్ ఎన్డీయేలోకి వస్తే పంజాబ్‌లో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది’’ అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments