Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫామ్ పైకి ఏనుగు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (14:08 IST)
అటవీ ప్రాణులు ప్రస్తుతం జనవాసానికి వచ్చేస్తున్నాయి. ఇటీవల చిరుతలు, పాములు జన ప్రాంతాలకు చేరుకుంటూ దాడి చేసిన ఘటనలు వింటూనే వున్నాం. తాజాగా అడవిలో ఉండాల్సిన ఏనుగు ఒకటి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం పైకి రావడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. 
 
రైలు కోసం ఎదురుచూస్తున్న వారు బతుకుజీవుడా.. అంటూ తలో దిక్కు పారిపోయారు. ఈ ఘటన హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రాజాజీ టైగర్‌ రిజర్వ్‌ నుంచి ఈ ఏనుగు హరిద్వార్‌ వైపు వచ్చినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
 
హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రైళు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక ఏనుగు తొండాన్ని ఆడించుకుంటూ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. అడవిలో ఉండాల్సిన ఏనుగు కాస్తా ప్లాట్‌ఫాంపై కనిపించడంతో ప్రయాణీకులు కంగుతిన్నారు. రెండో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన ఏనుగును గమనించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది.. బిల్వకేశ్వర్‌లోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 
దాంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. జీఆర్పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సాయంతో ఏనుగును సమీపంలోని రాజాజీ టైగర్‌ రిజర్వ్‌లోకి పంపించారు. దాంతో రైల్వే సిబ్బంది సహా ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments