Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫామ్ పైకి ఏనుగు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (14:08 IST)
అటవీ ప్రాణులు ప్రస్తుతం జనవాసానికి వచ్చేస్తున్నాయి. ఇటీవల చిరుతలు, పాములు జన ప్రాంతాలకు చేరుకుంటూ దాడి చేసిన ఘటనలు వింటూనే వున్నాం. తాజాగా అడవిలో ఉండాల్సిన ఏనుగు ఒకటి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం పైకి రావడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. 
 
రైలు కోసం ఎదురుచూస్తున్న వారు బతుకుజీవుడా.. అంటూ తలో దిక్కు పారిపోయారు. ఈ ఘటన హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రాజాజీ టైగర్‌ రిజర్వ్‌ నుంచి ఈ ఏనుగు హరిద్వార్‌ వైపు వచ్చినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
 
హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రైళు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక ఏనుగు తొండాన్ని ఆడించుకుంటూ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. అడవిలో ఉండాల్సిన ఏనుగు కాస్తా ప్లాట్‌ఫాంపై కనిపించడంతో ప్రయాణీకులు కంగుతిన్నారు. రెండో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన ఏనుగును గమనించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది.. బిల్వకేశ్వర్‌లోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 
దాంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. జీఆర్పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సాయంతో ఏనుగును సమీపంలోని రాజాజీ టైగర్‌ రిజర్వ్‌లోకి పంపించారు. దాంతో రైల్వే సిబ్బంది సహా ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments