Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం...

వరుణ్
సోమవారం, 5 ఆగస్టు 2024 (12:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారత ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 8వ తేజీ నుంచి 10వ తేదీ వరకు పర్యటించనున్నారు. వచ్చే సెప్టెంబరు 30వ తేదీ లోపు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యపంథాలో ఎన్నికలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. ఈ గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగియనుంది. దీంతో జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకుప క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించనుంది. 
 
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో తొలుత కమిషన్ సమావేశమవుతుంది. సీఈవో, ఎస్పీఎనోవో, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్‌తోనూ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కమిషన్ సమావేశమై ఎన్నికల సన్నాహకాలను సమీక్షిస్తుంది. 
 
ఆగస్టు 10వ తేదీన జమ్మూలో పర్యటించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశం అవుతుంది. అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు, గత మార్చిలోనూ జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. 
 
ఆ సమయంలోనే యూటీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు, రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంపైనా కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం