Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్న ఈసీ.. దుర్యోధనుడికి అధికారం కట్టబెట్టాలని?: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారిపోయిందన్నారు. ఎందుకంటే ధృతర

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (14:15 IST)
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారిపోయిందన్నారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఏం చేసైనా తన కుమారుడు దుర్యోధనుడికి అధికారం కట్టబెట్టాలని చూశాడు. ప్రస్తుతం ఈసీ కూడా అదేవిధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
 
అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై 13 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. ఇదే అంశంపై విపక్ష నేతల బృందం వచ్చే బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 26న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానాన్ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అరవిందే కేజ్రీవాల్ ఈసీకి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. తనకు 72 గంటల సమయమిస్తే ఈవీఎంల సమాచారాన్ని తారుమారు చేయగలనని ఢిల్లీ సీఎం ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల సందర్భంగా ఏ మీట నొక్కినా బీజేపీకే ఓటు పడినట్టుగా అధికారులు గుర్తించారు. 
 
ఈ విషయమై విపక్షాలు అధికార బీజేపీపై విరుచుకుపడ్డాయి. తాను ఐఐటీ స్టూడెంట్‌నని.. 72 గంటల సమయాన్ని కేటాయిస్తే.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని నిరూపిస్తానని కేజ్రీవాల్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments