Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ..చిన్నారికి HIV+

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (20:19 IST)
మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందుకు హెచ్ఐవీ సోకింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర, అకోలా జిల్లా ముర్తిజాపుర్​ మండలంలోని హిర్​పుర్​కు చెందిన దంపతులకు 8 నెలల క్రితం పాప జన్మించింది. 
 
చిన్నారి జన్మించిన మూడు రోజుల తర్వాత చిన్న, చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. ముర్తిజాపుర్​లోని చిల్డ్రన్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. పలు రకాల మెడికల్ టెస్టులు చేసిన  డాక్టర్లు.. చిన్నారికి రక్తకణాలు తక్కువగా ఉన్నాయని.. వెంటనే రక్తం ఎక్కించాలన్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు అకోలాలోని బీపీ ఠాక్రే బ్లడ్​బ్యాంకు నుంచి రక్తాన్ని తీసుకొచ్చారు. 
 
డాక్టర్లు ఆ రక్తాన్ని చిన్నారికి ఎక్కించారు. అయితే.. ఇటీవల చిన్నారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యపరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. చిన్నారికి హెచ్​ఐవీ పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. 
 
వెంటనే బాలిక తల్లిదండ్రులకూ పరీక్షలు నిర్వహించారు. అయితే వారిద్దరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో చిన్నారికి హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించారని నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments